న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్నారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు అంశం గురించి ప్రశ్న వేశారు. దానికి మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి యూరోప్ కొనుగోలు చేస్తున్న చమురు గురించి మీరు ఆలోచించాలని, మేం నెలలో కొన్న ఇంధనాన్ని యూరోప్ కేవలం ఒక్క పూటలో వాడేస్తుందని జైశంకర్ కౌంటర్ బదులు ఇచ్చారు. మంత్రి జైశంకర్ ఇచ్చిన ఆన్సర్.. ప్రతిపక్ష శివసేనను ఆకట్టుకున్నది. జైశంకర్ సూపర్బ్ అంటూ శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.చప్పట్లు కొడుతున్న ఎమోజీని కూడా ఆమె ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్పై ఆక్రమణకు వెళ్లిన రష్యాపై యూరోప్తో పాటు అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కౌంట్లో ఇండియాకు అయిల్ను అమ్మేందుకు రష్యా పూనుకున్నది. అయితే ఆ ఇంధనాన్ని రష్యా నుంచి భారత్ ఖరీదు చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Superb from EAM!👏🏼👏🏼
“If you're looking at India’s energy purchases from Russia, I'd suggest your attention should be on Europe— our purchases for the month would be less than what Europe purchases in an afternoon” pic.twitter.com/nUuWWWIdps— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) April 12, 2022