లక్నో: కాంగ్రెస్ కీలక నేత రాహుల్గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్ రాయ్ సోమవారం కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. ‘స్మృతి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు. లట్కే & జట్కే చేస్తారు, వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు.
అజయ్ రాయ్ వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుపట్టారు. లోక్సభలో ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను కించపరిచేలా మాట్లాడినందుకు అజయ్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ డిమాండ్పై అజయ్ రాయ్ స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
లట్కే & జట్కే అనేది తమ వ్యవహారిక భాషా పదమని, ‘ఏదో ఒకటి చెప్తారు, చేస్తారు’ అనేది ఆ పదానికి అర్థమని, అది అసభ్య పదజాలం, అనరాని వ్యాఖ్య ఎలా అవుతుందని అజయ్ రాయ్ ప్రశ్నించారు. తాను తప్పుడు మాటే మాట్లాడనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.