హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో రెండు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. పార్వతి లోయలోని చోజ్ నుల్లా వద్ద పలు ఇళ్లు, ఇతర ఆస్తులు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. బియాస్ నది పొంగి పొర్లుతోంది. ఈ నదిలో ఓ కారు గల్లంతవ్వగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది సాహాసోపేత రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చండీగఢ్ మనాలి హైవే పక్కన బియాస్ నది మధ్యలో ఇద్దరు ప్రయాణికులతో కూడిన కారు పడిపోయింది. వెంటనే ఐటీబీపీ డేరింగ్ రెస్క్యూ మిషన్ను ప్రారంభించింది. సిబ్బంది తాడు సహాయంతో కారును బయటకు తీసుకొచ్చారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల జాడ ఇంకా తెలియరాలేదు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
[WATCH] Dramatic visuals of ITBP rescue ops at Chandigarh Manali highway where a car has plunged into a river.
Two people are said to be missing@deepduttajourno with details. pic.twitter.com/zHRcBE978y
— TIMES NOW (@TimesNow) July 7, 2022