రాయ్పూర్: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన పెన్షన్ నిధులు రావడంలేదని ఆయన మండిపడ్డారు. ఏ కారణం లేకుండానే కేంద్రం పెన్షన్ నిధులు విడుదల చేయకుండా అట్టిపెట్టుకున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో తాము పాత పెన్షన్ స్కీమ్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) అమలు చేస్తున్నామని, దాని కోసం ఇప్పుడు నిధులు అవసరమని బఘేల్ చెప్పారు. పెన్షన్ డబ్బులు అంటే ఉద్యోగుల సొమ్ము అని, కాబట్టి కేంద్రం ఆ సొమ్మును వెంటనే రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సొమ్మును కేంద్రం ఎలా ఆపుతుందని ప్రశ్నించారు.