బెంగళూరు: ఇస్రో స్వరం మూగబోయింది. 3.. 2.. 1.. అంటూ ఇస్రో ప్రయోగాల్లో కౌంట్డౌన్ వినిపించే వాలర్మతి తనువు చాలించారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ దవాఖానలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
తమిళనాడులోని అరియలూర్లో 1959లో జన్మించిన వాలర్మతి కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.ఇస్రోలో చేరి తుది శ్వాస వరకు సేవలందించారు. ఆమె చివరిగా చంద్రయాన్-3 మిషన్కు సేవలు అందించారు. ఇస్రో మాజీ డైరెక్టర్ పీవీ వెంకిటకృష్ణన్ ఆమె సేవలను కొనియాడారు.