బెంగళూరు, జూన్ 22: ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 30న ఈ ప్రయోగం నిర్వహిస్తారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.