ISRO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: మంగళయాన్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అంగారక ప్రయోగానికి సిద్ధమవుతున్నది. నాసా ప్రయోగించిన ఇంజిన్యూటీ క్వాడ్కాప్టర్ మాదిరిగా ఇస్రో కూడా మార్స్పైకి రోటోకాప్టర్ను పంపేందుకు యోచిస్తున్నది. ఈ డ్రోన్ మార్స్ వాతావరణంపై పరిశోధన చేసేందుకుగానూ 100 మీటర్ల ఎత్తులో ఎగురుతుందని మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇంకా ప్రాథమిక దశలో ఉన్న ఇస్రో రోటోకాప్టర్.. ఉష్ణోగ్రత, తేమ, పీడనం, గాలి వేగం, ఎలక్ట్రిక్ ఫీల్డ్, డస్ట్ సెన్సర్లను అంగారకుడిపైకి తీసుకెళ్లనున్నది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన క్వాడ్కాప్టర్ ఇటీవలే మూడేండ్ల మిషన్ను పూర్తి చేసుకొన్నది.