శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వారా ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాది ఫహీం భట్.. ఏఎస్ఐ మహ్మద్ ఆశ్రఫ్ మర్డర్ కేసులో నిందితుడు అని పోలీసులు పేర్కొన్నారు. ఫహీం భట్ ఇటీవలే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ సంస్థలో చేరినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీగుఫ్వారా ఏరియాలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.