గువాహటి: ఐసిస్ ఇండియా చీఫ్, అతని అనుచరుడిని బుధవారం అస్సాంలోని ధుబ్రి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ధర్మశాల దగ్గర వారిని పట్టుకున్నట్టు అస్సాం పోలీస్ చీఫ్ పీఆర్వో ప్రణబ్జ్యోతి గోస్వామి తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు హరీష్ అజ్మల్ ఫరూఖీగా గుర్తించారు. ఇతను ఇండియాలో ఐసిస్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. మరొకరు అనురాగ్ సింగ్. వీరు ఐసిస్లో దేశమంతా రిక్రూట్మెంట్, ఫండింగ్, టెర్రర్ చర్యలను చేపట్టే పనిలో ఉన్నారు. దేశంలో ఐసిస్ను విస్తరించే పనిలో భాగస్వాములు. వీరిద్దరిపై ఎన్ఐఏ, ఢిల్లీ, ఏటీఎస్, లక్నో తదితర ప్రాంతాల్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు.