భాగల్పూర్, ఫిబ్రవరి 26: ఇషికా ఝా, సంస్కృతి మాలవీయ ఇద్దరూ బీహార్లోని భాగల్పూర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) మూడో సంవత్సరం చదువుతున్నారు. చదువు ఇంకో సంవత్సరం ఉండగానే వీరిద్దరికి క్యాంపస్ సెలక్షన్స్లో అదిరిపోయే ప్యాకేజీతో ఆఫర్ దక్కింది. 83 లక్షల వార్షిక వేతనంతో ఈ ఇద్దరు అమ్మాయిలు జాబ్ కొట్టేశారు.
అంటే నెలకు అక్షరాల 7 లక్షల వేతనం. సాధారణంగా ఇంత పెద్ద ప్యాకేజీలు ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు లభిస్తుంటాయి. అట్లాంటిది ట్రిపుల్ ఐటీ చేస్తున్న ఈ ఇద్దరు విద్యార్థులకు ఇంత భారీ ప్యాకేజీలు దక్కటం విశేషం. ఇషికా ది హర్యానాలోని ఓ చిన్న పట్టణం కాగా, సంస్కృతిది యూపీలోని ప్రయాగ్రాజ్.