పముఖ పెన్నుల తయారీ సంస్థ రెనాల్డ్స్ తన 045 ఫైన్ కార్బర్ బాల్ పాయింట్ పెన్నుల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది.
ఈ వార్తను 2.3 మిలియన్ల మంది చూశారు. దీంతో రెనాల్డ్స్ కంపెనీ దీనిపై స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వార్తలో నిజం లేదని తేల్చిచెప్పింది. తమ యూజర్లను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారని కంపెనీ పేర్కొంది.