న్యూఢిల్లీ, జూన్ 19: ‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (రా) చీఫ్గా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను రా చీఫ్గా నియమిస్తూ కేంద్ర క్యాబినెట్ కమిటీ సోమవారం ప్రకటన జారీ చేసింది.
ప్రస్తుతం ఆయన ‘రా’లో సెకండ్ ఇన్ కమాండ్గా ఉన్నారు. రవి సిన్హా ‘రా’ చీఫ్గా రెండేండ్లపాటు కొనసాగనున్నారు. ప్రస్తుత చీఫ్ గోయెల్ పదవీకాలం జూన్ 30తో ముగియనున్నది.