చెన్నై: తరుచూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయటంలో భారతదేశం ప్రపంచంలో మొదటిస్థానంలో నిలిచింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలతో 187 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా, అందులో 84 ఘటనలు మన దేశంలోనే చోటుచేసుకొన్నాయని డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ తెలిపింది. అందులోనూ ముఖ్యంగా కశ్మీర్లో 49 సార్లు ఇంటర్నెట్ను బంద్ చేసినట్టు వెల్లడించింది. ఇంటర్నెట్ షట్డౌన్లో భారత్ మొదటి స్థానంలో నిలవటం వరుసగా ఇది ఐదో సంవత్సరం. గత ఐదేండ్లలో అత్యధిక ఇంటర్నెట్ షట్డౌన్ ఘటనలు చోటుచేసుకొన్నది 2022లోనే.