న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు బుధవారం ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం, భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు చాలా మంది వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ‘ఈ ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా’ అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సుప్రీం కోర్టులో జరిగిన యోగా దినోత్సవంలో యోగాస నాలు వేశారు.