న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని భారత జీనోమిక్స్ కన్సార్షియం ఇన్సాకాగ్ తెలిపింది. డెల్టాలాంటి ప్రమాదకర వేరియంట్లతో పోల్చి చూస్తే ఏవై.4.2 వ్యాప్తి 0.1కన్నా తక్కువగా ఉన్నదని వెల్లడించింది. డెల్టా, ఇతర కరోనా వేరియంట్లను అడ్డుకోవడంలో వ్యాక్సిన్లు ఏవిధంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయో.. ఏవై.4.2 వేరియంట్ను అడ్డుకోవడంలోనూ అంతే సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికీ భారత్లో ప్రమాదకర కరోనా వేరియంట్ డెల్టానేనని వివరించింది.