కోల్కతా: దేశంలోనే అతిపెద్ద సర్వేనౌక ఐఎన్ఎస్ సంధాయక్ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. దీనిని స్వదేశంలోనే డిఫెన్స్ పీఎస్యూ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ సంస్థ తయారుచేసింది. నౌకాదళం కోసం జీఆర్ఎస్ఈ తయారుచేస్తున్న నాలుగు సర్వే నౌకల్లో సంధాయక్ నౌక మొదటిదని అధికారులు వెల్లడించారు. నేవీ డే సందర్భంగా సోమవారం ఈ నౌకను నౌకాదళానికి అందజేసినట్టు పేర్కొన్నారు.