న్యూఢిల్లీ: లేయర్ షాట్స్ కంపెనీకి చెందిన వివాదాస్పద డియోడరెంట్ యాడ్పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధం విధించింది. తక్షణమే ఈ యాడ్ను బ్యాన్ చేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. అడ్వర్టైయిజింగ్ నియమావళి ప్రకారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ఐబీ శాఖ వెల్లడించింది. అనుచిత రీతిలో చిత్రీకరించిన డియోడరెంట్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆ యాడ్ను తమ ఖాతాల నుంచి డిలీట్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్లను ఆదేశించినట్లు ఐబీశాఖ తన ట్వీట్లో వెల్లడించింది. ఆ యాడ్ను ప్రసారం చేసిన టీవీ ఛానల్కు కూడా నోటీసులు ఇచ్చామని, ఆ ఛానల్ కూడా యాడ్ను ప్లే చేయడం లేదని కేంద్ర సమాచారా, ప్రసార శాఖ తెలిపింది. డియోడరెంట్ యాడ్ అత్యాచార ప్రవృత్తిని రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.