ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో నాలుగు రోజుల క్రితం పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. శ్రేయా కర్లా అనే మహిళ నగరంలోని రసోమా స్క్వేర్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్పై రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది. బ్లాక్ డ్రెస్సు వేసుకున్న ఆమె.. డోజా క్యాట్ సాంగ్కు స్టెప్పులేసింది. ఆ రూట్లో వెళ్తున్న వాహనదారులు.. రోడ్డుపై ఆమె డ్యాన్స్ చూసి అవాక్కు అయ్యారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం ఆ మహిళపై చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో ఆమెకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.