ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్(Indore)లో దారుణం జరిగింది. పెంపుడు కుక్కల గురించి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ ఘర్షణ కాస్త కాల్చివేత(Firing)కు దారి తీసింది. రాజ్పాల్ సింగ్ రజావత్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న గన్తో పక్కింటి వ్యక్తిని షూట్ చేశాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. బాల్కనీ నుంచి 12-బోర్ రైఫిల్తో షూటింగ్కు పాల్పడిన రాజ్పాల్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
#firinginIndore: 2 dead, 7 injured Dispute on the issue of dogs security guard of the bank Rajpal Rajawat opened fire Police has arrested accused.
There was a fight over walking the dog, the #banksecurityguard opened fire on a minor issue. #Banksecurityguard#IndoreFiring pic.twitter.com/EgVi2iDGGO— Abhimanyu Indian (@Abhi321997) August 18, 2023
రజావత్, విమల్ అచల.. ఇద్దరూ పక్కింటివాళ్లు. ఆ ఇద్దరూ రాత్రి 11 గంటలకు కృష్ణ భాగ్ కాలనీలో తమ కుక్కల్ని బయటకు తీసుకువెళ్లారు. వాకింగ్కు వెళ్లిన సమయంలో.. ఆ రెండు పెంపుడు కుక్కల మధ్య ఫైట్ మొదలైంది. దీంతో వాటి ఓనర్లు కూడా గొడవకు దిగారు. ఆ సమయంలో రజావత్ ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లోకి వెళ్లి తన వద్ద ఉన్న 12-బోర్ గన్తో ఫైరింగ్ చేశాడు. తన ఇంటి బాల్కనీ నుంచే అతను కాల్పులు జరిపాడు.
రజావత్ కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పై అంతస్తు నుంచి అతను కింద ఉన్న వ్యక్తుల్ని షూట్ చేశాడు. వీధుల్లో ఉన్న జనం అరుస్తున్నా.. రజావత్ తన గన్కు పనిపెట్టాడు. అచలతో పాటు రాహుల్ వర్మ.. ఇద్దరూ ఆ తూటాలకు బలయ్యారు. గొడవ సమయంలో వీధిలో ఉన్న మరో ఆరుగురు కూడా గాయపడ్డారు. ఇద్దరికి గాయాలు తీవ్రంగా ఉన్నాయి. రజావత్, అతని కుమారుడిపై మర్డర్ కేసు నమోదు చేశారు. గ్వాలియర్కు చెందిన రజావత్ను ఓ ప్రైవేటు సంస్థ విధుల్లో పెట్టుకున్నది. అతని వద్ద 12 బోర్ రైఫిల్ ఉండడం వల్లే అతనికి సెక్యూర్టీ గార్డు ఉద్యోగం ఇచ్చారు.