న్యూఢిల్లీ: స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో భారత్ కీలక అడుగులు వేసింది. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ను డెవలప్ చేసింది. అస్త్రా క్షిపణి(Astra Missile)ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ తో దాన్ని ఆపరేట్ చేశారు. సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ ద్వారా ఆ క్షిపణి పరీక్షించారు. ఒడిశా తీరంలో ఈ పరీక్ష జరిగింది. డీఆర్డీవో, ఐఏఎఫ్ సంయుక్తంగా ఈ పరీక్ష చేపట్టాయి. పరీక్ష సమయంలో రెండు సార్లు క్షిపణి ప్రయోగించారు.
వేర్వేరు రేంజ్ల్లో ఉన్న హై స్పీడ్ ఏరియల్ టార్గెట్లను పేల్చారు. రెండు కేసుల్లోనూ అస్త్రా క్షిపణి టార్గెట్లను ధ్వంసం చేసింది. ట్రయల్స్ సమయంలో సబ్ వ్యవస్థలన్నీ అనుకున్న రీతిలో పనిచేశాయి. ఆర్ఎఫ్ సీకర్ను డీఆర్డీవో డిజైన్ చేసి, డెవలప్ చేసింది. అస్త్రా వెపన్ సిస్టమ్కు చెందిన ఫ్లయిట్ డేటాను ట్రాక్ చేసి దాని పనితీరును అంచనా వేశారు. ఆధునిక మిస్సైళ్లలో రేడియో ఫ్రీక్వెన్సీ కీలకమైన అంశంగా మారింది. ఆటోమెటిక్గా టార్గెట్ను ట్రాక్ చేస్ఉతంది. దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ కేపబిలిటీగా పిలుస్తున్నారు.
అస్త్రా బీవీఆర్ఏఏఎం(బిహాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్) సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను పేల్చగలదు. అత్యుత్తమమైన గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. అస్త్రా వెపన్ సిస్టమ్ కోసం సుమారు 50 పబ్లిక్, ప్రైవేటు పరిశ్రములు భాగం పంచుకున్నాయి. అస్త్రా పరీక్ష విజయవంతంగా కావడం పట్ల డీఆర్డీవో, ఐఏఎఫ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ మెచ్చుకున్నారు.
DRDO and @IAF_MCC conducted successful trials of Beyond Visual Range Air-to-Air missile (BVRAAM) ‘ASTRA’ with indigenous RF seeker against high-speed unmanned aerial targets at different ranges, target aspects and launch platform conditions from Su-30 Mk-I platform off the coast…
— DRDO (@DRDO_India) July 11, 2025