శ్రీనగర్, ఫిబ్రవరి 20: దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్-ఖారీ-సంబర్-సంగల్దాన్ సెక్షన్లో ఈ సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లుగా ఉంది.
దీనిని టి-50గా పిలుస్తారు. ‘అత్యవసర పరిస్థితుల్లో టన్నెల్ నుంచి తప్పించుకునేందుకు టి-50కి సమాంతరంగా ఎస్కేప్ టన్నెల్ కూడా ఉంది. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు చెప్పారు.