బెంగళూరు, సెప్టెంబర్ 7: సూర్యుడి దిశగా పరుగులు పెడుతున్న ఆదిత్య-ఎల్1 తన క్షేమ సమాచారాన్ని ఇస్రోకు తెలిపింది. దీంతో పాటు తన కెమెరాకు పని చెప్పింది. భూమి, జాబిల్లిల ఫొటోలను చిత్రీకరించింది. పనిలో పనిగా తనూ ఓ సెల్ఫీ తీసుకుంది. ఈనెల 4న ఆదిత్య-ఎల్1 శాటిలైట్లోని ఆన్బోర్డ్ కెమెరా సాయంతో చిత్రీకరించిన ఈ ఫొటోలను ఇస్రో తాజాగా షేర్ చేసింది. ‘ఆదిత్యుడి దిశగా పయనిస్తున్న ఆదిత్య-ఎల్1 భూమి, చంద్రుడి ఫొటోలను చిత్రీకరించింది.
సెల్ఫీ కూడా తీసుకుంది’ అని సోషల్ మీడియాలో ఎక్స్ తెలిపింది. ఆదిత్య-ఎల్1 తీసిన ఈ ఫొటోలో భూమి, చంద్రుడు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. భూమి ముందు జాబిల్లి ఓ చుక్కలా కనిపిస్తున్నదని ఇస్రో వెల్లడించింది. మరోవైపు ఆదిత్య-ఎల్1 తీసుకున్న స్వీయచిత్రంలో వీఈఎల్సీ పేలోడ్తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజర్ (ఎస్యూఐటీ) పరికరం కూడా కనిపిస్తున్నది.