ఇస్లామాబాద్, జూలై 23: ఈసారి పాకిస్థాన్లో ఉన్న ప్రియుడిని కలుసుకోవడానికి భారత్ నుంచి ఒక వివాహిత వెళ్లింది. న్యూఢిల్లీకి చెందిన 35 ఏండ్ల అంజు అనే వివాహిత ఆన్లైన్లో పరిచయమైన నస్రుల్లా (29) అనే వ్యక్తి కోసం పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తుఖ్వాకు వచ్చిందని ఆజ్ న్యూస్ ఆదివారం వెల్లడించింది. కాగా నస్రుల్లాతో ఆమెకు గత నాలుగేండ్లుగా ఫేస్బుక్లో పరిచయం ఉంది. ఆమె వాఘా మీదుగా ఇస్లామాబాద్కు చేరుకుంది. 30 రోజుల బాటు చెల్లుబాటయ్యే వీసా ఆమె దగ్గర ఉందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఆమెను విచారిస్తున్నట్టు చెప్పారు.