దుబాయ్, నవంబర్ 16: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నివసిస్తున్న భారతీయుడు శ్రీజును అదృష్టం వరించింది. ప్రతివారం నిర్వహించే మహ్జూజ్ డ్రాలో రూ.45.30 కోట్లు గెలుచుకున్నాడు. గ్యాస్ పరిశ్రమలో ఆపరేటర్గా పనిచేసే శ్రీజు గత మూడేండ్లుగా ఈ డ్రాలో పాల్గొంటున్నాడు. ఏదో ఒక రోజు అదృష్టం వరించకపోతదా అన్న ఆశతో ఎదురుచూస్తున్న అతడికి ప్రస్తుతం కలిసొచ్చింది. ఈ సందర్భంగా శ్రీజు మాట్లాడుతూ ఈ ఆనంద సమయంలో నోటి నుంచి మాటలు కూడా రావడం లేదని చెప్పాడు.