Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పరిమితి దాటితే అదనపు లగేజీపై చార్జీలు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే లగేజీలపై పరిమితి విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఏసీ త్రీటైర్, స్లీపర్ క్లాసుల్లో 40 కిలోల వరకు అనుమతించనున్నారు. జనరల్ బోగీల్లో 35 కిలోల వరకు లగేజీని అనుమతించనున్నారు. ఇక ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు అనుమతించనున్నారు. ఈ పరిమితి దాటితే అదనంగా చార్జీలు వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక ప్రస్తుతం నాలుగు గంటల ముందు ప్రిపేర్ చేస్తున్న రిజర్వేషన్ చార్ట్ను 10 గంటల ముందు ప్రిపేర్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఈ కొత్త టైమింగ్స్ ప్రకారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్ట్ను ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా రూపొందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బయల్దేరే రైళ్ల తొలి చార్టును కనీసం 10 గంటల ముందు రూపొందించనున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం చార్టుల తయారీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖ రాసింది.