దుబాయ్, ఫిబ్రవరి 26: అరబ్ ఎమిరేట్స్లోని జైళ్లలో మగ్గిపోతున్న ఎందరో ఖైదీలకు ఓ భారతీయ వ్యాపారి కొత్త జీవితాన్ని అందించారు. అందుకోసం ఆయన అక్కడి ప్రభుత్వానికి అక్షరాల రూ.2.25 కోట్లు చెల్లించారు. ఇదంతా ఆయన పరోపకారార్థం చేశారు. వివరాల్లోకి వెళితే.. ముస్లింల పవిత్ర మాసం రంజాన్కు ముందు ఎమిరేట్స్కు చెందిన భారతీయ వ్యాపారవేత్త 66 ఏండ్ల ఫిరోజ్ మర్చంట్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ దేశంలోని వివిధ జైళ్లలో మగ్గిపోతున్న 900 మంది ఖైదీలను విడిపించాలనుకున్నారు. తన సొంత సొమ్ము రూ.2.25 కోట్లను అక్కడి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఫిరోజ్ మర్చంట్ ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్ యజమాని. 2008లో ఏర్పాటు చేసిన ది ఫర్గాటెన్ సొసైటీ చొరవతో 2024లో ఇప్పటి దాకా అరబ్ దేశాల్లోని 900 మంది ఖైదీలను ఫిరోజ్మర్చంట్ విడుల చేయించారు. అంతేకాదు.. ఖైదీలు తమ దేశాలకు వెళ్లటానికి అవసరమైన రవాణా చార్జీలు కూడా తనే భరించారు. ఈ ఏడాది 3వేల మంది ఖైదీలను విడిపించాలని ఫిరోజ్ మర్చంట్ టార్గెట్గా పెట్టుకున్నాడట. అతని దాతృత్వానికి ఎమిరేట్స్లోని సీనియర్ అధికారులంతా ఫిదా అయ్యారు.