న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సును ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సోమవారం ఆవిష్కరించింది. ఇది కేవలం నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తుంది.
శిలాజ ఇంధనాల స్థానంలో ప్రత్యామ్నాయాలను తీసుకురావడంలో ఇదొక కీలక పరిణామం. ఈ బస్సును కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.