లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. అరేబియన్ సముద్రంలో యుద్ధ నౌక నుంచి జరిపిన ఈ ప్రయోగం విజయంతం కావడం నావికా దళానికి మరింత శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చిందని అధికారులు తెలిపారు. డీఆర్డీవో డిజైన్ చేసిన ఈ దేశవాళి క్షిపణి ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిశ్చయాన్ని తెలియజేస్తున్నదని ఒక మిలటరీ అధికారి వ్యాఖ్యానించారు. ఈ బ్రహ్మోస్ క్షిపణులు శబ్దం వేగం కంటే దాదాపు మూడు రెట్ల వేగంతో దూసుకెళ్తాయి. ఈ బ్రహ్మోస్ క్షిపణులను దేశం ఇప్పటికే విదేశాలకు ఎగుమతి చేస్తున్నది.