ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా మారింది. ఈ తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం తౌటే తుఫాన్ పశ్చిమ వాయవ్యం దిశగా గంటకు 20 కి.మీల వేగంతో పయనిస్తున్నది. ఈ రాత్రికి గుజరాత్లోని పోరుబందర్- మహువా మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఆ నౌకలో 273 మంది ఉన్నట్లు సమాచారం. దాంతో కొట్టుకుపోయిన నౌక కోసం ఇండియన నేవీ గాలింపు చర్యలు చేపట్టింది. ఐఎన్ఎస్ కొచ్చి యుద్ధనౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.