న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశంలో ఈ ఫిబ్రవరి నెలలో అత్యధిక ఎండలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఫిబ్రవరి నెలలో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 1877 తర్వాత ఈ ఏడాదే అధికంగా ఉన్నదని తెలిపింది. ఈ ఫిబ్రవరిలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలు నమోదైందని వెల్లడించింది.
మార్చిలో వడగాడ్పుల ప్రభావం కొంత వరకు ఉండొచ్చని, ఏప్రిల్, మేలో మాత్రం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నది.