ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరగడంతో లాక్డౌన్ విధించారు. ఇటలీలో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఈనేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు.