న్యూఢిల్లీ, ఆగస్టు 7: అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ (జే&జే ) అభివృద్ధి చేసిన సింగిల్-డోసు కరోనా టీకాకు అత్యవసర వినియోగం కింద భారత్ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనాపై పోరుకు ఈ నిర్ణయం మరింత శక్తినిస్తుందని చెప్పారు. జే&జే టీకాతో భారత్లో ఎమర్జెనీ వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ల సంఖ్య ఐదుకు పెరిగింది. టీకాకు అనుమతి కోసం జే&జే సంస్థ శుక్రవారమే దరఖాస్తు చేసుకొన్నది. టీకాకు అనుమతి లభించడంపై జే&జే హర్షం వ్యక్తం చేసింది.
ఒక్క డోసే
ఈ టీకాను ఒక్క డోసులోనే ఇస్తారు. సామర్థ్యం 85శాతం అని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. టీకా వేసుకొన్న 14 రోజుల తర్వాత యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయి. దీనిని గది ఉష్ణోగ్రతల వద్ద కూడా మూడు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఫైజర్, మోడెర్నా తరహాలో ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కాదు. కొవిషీల్డ్లాగా ఎడినో వైరస్ను ఉపయోగించి ఈ టీకాను తయారు చేశారు. అయితే ఈ టీకా వేసుకొన్నవారిలో రక్తం గడ్డకట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో కొన్నాళ్లు ఈ టీకాను నిలిపివేశారు. కానీ, చాలా తక్కువ మందిలోనే ఈ లక్షణాలు కనిపించినట్టు వెల్లడి కావడంతో తిరిగి ఈ వ్యాక్సిన్ను వేస్తున్నారు.
దేశంలో ఇప్పటికే అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన టీకాలు