తిరువనంపురం: కేరళలోని కొచ్చిలో రెండో హెలికాప్టర్ స్క్వాడ్రన్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించింది. దేశీయంగా తయారు చేసిన ఏఎల్హెచ్ మార్క్ 3 హెలికాప్టర్ల రెండో స్క్వాడ్రన్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్ వీఎస్ పఠానియా బుధవారం ప్రారంభించారు. కొచ్చిలోని కోస్ట్గార్డ్ ఎయిర్ ఎన్క్లేవ్ (సీజీఏఈ)లో ఈ స్క్వాడ్రన్ను ఆయన ప్రారంభించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. పశ్చిమ సముద్ర తీరంలో గస్తీతోపాటు సెర్చ్, రెస్క్యూ సామర్థ్యాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సైనిక, పౌర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నట్లు వివరించారు.
కాగా, ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏఎల్హెచ్ మార్క్ 3 హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేసినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్ వీఎస్ పఠానియా తెలిపారు. ఈ హెలికాప్టర్ల రెండో స్క్వాడ్రన్ అందుబాటులోకి రావడంతో సముద్రంలో సుదీర్ఘ మెరైన్ సెక్యూరిటీ, నిఘాకు ఇది సహకరిస్తుందని చెప్పారు. ఈ హెలికాప్టర్ల స్క్వాడ్రన్ ఏర్పాటు దేశ స్వావలంబనకు నిదర్శనమని అన్నారు. హెలికాప్టర్ల రెండవ స్క్వాడ్రన్ పశ్చిమ సముద్ర తీరంలో భద్రతను మరింతగా పెంచుతుందని, సెర్చ్, రెస్క్యూ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని పఠానియా వెల్లడించారు.