హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు మరో కాంస్యం దక్కింది. మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ ప్రీతి పవార్ కాంస్య పతకం దక్కించుకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో చైనా బాక్సర్ చాంగ్ యువాన్ చేతిలో బాక్సర్ ప్రీతి ఓడిపోవడంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అంతకుముందు 2018లో జరిగిన 18వ ఆసియా క్రీడల్లో చైనా బాక్సర్ చాంగ్ యువాన్ బంగారు పతకం సాధించింది. కాగా ఈ ఆసియా క్రీడల్లో ప్రీతి గెలుచుకున్న కాంస్యంతో కలిపి రెండు పతకాలు వచ్చినట్లయ్యింది. మొత్తం పతకాల సంఖ్య 60 దాటింది. ఎక్కువగా షూటింగ్లో 20కి పైగా పతకాలు వచ్చాయి.