న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలోనూ సైనికులు కనురెప్ప వాల్చకుండా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. గడ్డ కట్టే చలిలోనే కాదు.. భీకరంగా మంచు కురుస్తున్నా.. పెట్రోలింగ్ విధులను యధావిధిగా నిర్వహిస్తున్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో భారీగా మంచు కురుస్తోంది. ఆ హిమపాతంలోనూ భారతీయ ఆర్మీ తీవ్ర గస్తీ నిర్వహిస్తోంది. 17 వేల ఫీట్ల ఎత్తున ఉన్న కుప్వారా సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న కొండల్లో మంచు వర్షానికి బెదరకుండా పెట్రోలింగ్ చేపడుతున్నారు. ఇక కీరన్ సెక్టార్లో స్నో స్కూటర్లను వాడుతున్నారు. ఫార్వర్డ్ లొకేషన్లో శత్రు దేశ కదలికలను పసికట్టేందుకు భారీ హిమపాతంలోనూ స్నో స్కటర్లతో పహారా కాస్తున్నారు. మరోవైపు భీకరమైన మంచు, వర్షం వల్ల శ్రీనగర్ వద్ద వేల సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయి. వైష్ణవోదేవి ఆలయం వద్ద కురుస్తున్న మంచు వల్ల బ్యాటరీ కారు, హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు.
No easy hope or lies
— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2022
Shall bring us to our goal,
But iron sacrifice
Of body, will, and soul.
There is but one task for all
One life for each to give
Who stands if Freedom fall? pic.twitter.com/X3p3nxjxqE
Compare this with your early morning walk in the park! #IndianArmy #BashOnRegardless
— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2022
VC: @Whiteknight_IA pic.twitter.com/itVLukvQT3