ఈ దేశం గురించి, మన ఆర్మీ గురించి సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సారిగా ఏం మాట్లాడారు? ఇది అత్యంత ఆసక్తికర విషయం. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను భారత ఆర్మీ విడుదల చేసింది. ఈ వీడియో నిడివి 1.10 నిమిషాలు. ఈ వీడియోను డిసెంబర్ 7 సాయంత్రం రికార్డు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ”మన జవాన్లను చూసి గర్విస్తున్నాం. అందరం కలిసి విజయ పర్వ్ విజయోత్సవాన్ని జరుపుకుందాం” అని రావత్ ఆ వీడియోలో పిలుపునిచ్చారు. 1971 లో భారత్-పాక్ యుద్ధం సంభవించింది. పాక్పై భారత్ విజయం సాధించింది. ఈ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు రావత్ ఈ వీడియోలో నివాళులర్పించారు. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించి, 50 వసంతాల వేడుకలు ఢిల్లీలో జరిగాయి. ఈ సందర్భంగా బిపిన్ రావత్ వీడియోను ఆర్మీ అధికారులు ప్లే చేశారు.