India Vs Bharat | కోల్కతా, సెప్టెంబర్ 10: ఇండియా పేరును భారత్గా మార్చడం ఇష్టం లేని వారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఖరగ్పూర్లో ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్కతాలో ఉన్న విదేశీయుల విగ్రహాలన్నీ తొలగిస్తామని ప్రకటించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను టీఎంసీ ప్రతినిధి శంతన్ సేన్ ఖండిస్తూ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ ఇలాంటి యత్నాలు చేస్తున్నదన్నారు.