న్యూఢిల్లీ: ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వ్యాక్సినేషన్లో అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో పది కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకాలు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇవాళ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలో టీకాలు ఇవ్వడం ప్రారంభించిన 85 రోజుల్లో కేవలం 9.2 కోట్ల మందికి, చైనాలో 6.1 కోట్ల మందికి మాత్రమే టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ప్రస్తుతం ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కొన్ని చోట్ల కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. రోజువారిగా టీకా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో 45 ఏళ్లు దాటిన వారందికీ కోవిడ్ టీకా ఇస్తున్న విషయం తెలిసిందే.