ముంబై: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని పరీక్షించారు. పశ్చిమ తీరంలో ఈ పరీక్షను చేపట్టారు. సముద్రం నుంచి సముద్రంపై టార్గెట్లను చేధించే వేరియంట్ను పరీక్షించినట్లు తెలుస్తోంది. అయితే మ్యాగ్జిమం దూరం ప్రయాణించి.. ఆ క్షిపణి టార్గెట్ నౌకను పేల్చినట్లు భారతీయ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.