న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సెల్ఫోన్ వినియోగదారులు ఇకపై పేపర్ ఫారాలను నింపాల్సిన అవసరం లేకుండా సిమ్కార్డు పొందొచ్చు. ఈ మేరకు పేపర్ ఆధారిత కేవైసీ విధానానికి స్వస్తి పలుకుతూ టెలికం విభాగం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి టెలికం కంపెనీలు డిజిటల్ విధానంలో వెరిఫికేషన్ పూర్తిచేసి సిమ్కార్డులను జారీచేయనున్నాయి.
సిమ్కార్డుల జారీకి పేపర్ ఆధారిత కేవైసీ విధానాన్ని 2012 నుంచి అవలంబిస్తున్నారు. తాజాగా తీసుకొన్న ఈ-కేవైసీ విధానం వల్ల సిమ్ కార్డుల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని, కస్టమర్లను చేర్చుకోవడంలో టెలికం కంపెనీల ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.