న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కెనడా దౌత్యవేత్తలకు భారత్ మరో హెచ్చరిక జారీ చేసింది. తమ దేశంలోని 41మంది దౌత్యవేత్తలను ఈ నెల 10లోగా ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. లేకుంటే వారు తక్షణం ఆ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. మనదేశంలో కెనడా దౌత్యవేత్తలు 60 మంది ఉన్నారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ ఈ ఏడాది జూన్లో కెనడాలో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక భారత్ ఇంటిలిజెన్స్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణ చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.