న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గతకొన్ని రోజులుగా పెరుగుటే కాని తగ్గుట లేదన్నట్లుగా కరోనా కేసులు (Corona cases) నమోదవుతున్నాయి. బుధవారం 2927 కేసులు రికార్డవగా, నేడు కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్ ఉన్నాయి.
గత 24 గంటల్లో 39 మంది కరోనాకు బలవగా, 2563 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతానికి పెరిగిందని తెలిపింది. కాగా, మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.74 శాతం అని, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,88,40,75,453 వ్యాక్సిన్లు పంపిణీ చేశామని, గత 24 గంటల్లో 19,53,437 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలపింది.