న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 3,52,784 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18,84,937 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 94.21 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 13.39 శాతం నుంచి 14.50 శాతానికి పెరిగింది. వీక్లి పాజిటివిటీ రేటు 16.40 శాతంగా నమోదైంది. ఇక దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 165.6 కోట్లకు పైగా కొవిడ్ టీకాల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.