న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1260 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,27,035కు చేరాయి. ఇందులో 4,24,92,326 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,21,264 మంది చనిపోయారు. ఇంకా 13,445 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 83 మంది మహమ్మారికి బలవగా, 1404 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
కాగా, మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని, 98.76 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతమని తెలిపింది. ఇక 79.02 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నది. నిన్న ఒక్కరోజే 5,28,021 మందికి కరోనా టెస్టులు చేశామని వెల్లడించింది. ఇప్పటివరకు 1,84,52,44,856 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.