న్యూఢిల్లీ : దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 195 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,73,952 ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా 129.5 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.