న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 3688 కేసులు నమోదవగా, కొత్తగా 3324 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,79,188కి చేరాయి. ఇందులో 4,25,36,253 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,23,843 మంది మరణించగా, 19,092 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 2876 మంది కోలుకోగా, 40 మంది మృతిచెందారని తెలిపింది.