న్యూఢిల్లీ, నవంబర్ 18: భారత్లో ‘పొగ’రాయుళ్ల (smokers) సంఖ్య అధికంగా ఉందని, ధూమపాన అలవాటును మానేసే వారి శాతం తక్కువగా ఉన్న దేశాల జాబితాలో కూడా మన దేశం ఉందని తాజా నివేదికలో వెల్లడైంది. ధూమపాన వ్యతిరేక పోరాటానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ కమిషన్ ‘ఇంటర్నేషనల్ కమిషన్ టు రీఇగ్నైట్ ది ఫైట్ అగైనెస్టు స్మోకింగ్’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 16 నుంచి 64 ఏండ్ల మధ్య వయస్కుల్లో పొగతాగే వారి సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. చైనా, భారత్లో కలిపి 16-64 ఏండ్ల వయసు వారిలో పొగాకు వినియోగదారులు 50 కోట్లకు పైగా ఉన్నారు.