Swiggy | బిర్యానీ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అంటే ఉండనే ఉండరు. బిర్యానీ వాసనకే కడుపు నిండిపోతోంది. మరి అంతటి రుచికరమైన బిర్యానీని భారతీయులు ఈ ఏడాది భారీ స్థాయిలో ఆరగించేశారు. 2022 ఏడాదిలో స్విగ్గీ ద్వారా నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు స్విగ్గీ వర్గాలు పేర్కొన్నాయి. 2021లో ఈ సంఖ్య 115 ఉంటే ఇప్పుడు మాత్రం ఆ సంఖ్యను దాటేసింది. ఈ ఏడాది 2.28 శాతం పెరిగింది.
బిర్యానీతో పాటు క్లాసిక్ మసాలా దోశను కూడా అధికంగా ఆర్డర్ చేసినట్లు తేలింది. స్నాక్స్ విభాగంలో సమోసాను ఎక్కువగా ఆర్డర్ చేశారు. సమోసా కోసమే 40 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత దాదాపు 20 లక్షల ఆర్డర్లకు పైగా పాప్ కార్న్ కోసం వచ్చాయి. గులాబ్ జాం కోసం 27 లక్షల ఆర్డర్లు, రస్మలై కోసం 16 లక్షలు, చాకో లావా కేక్ కోసం 10 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించింది.