న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత వారం రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే 4,100 మంది మరణించినట్లు తెలిపింది. ఈ సంఖ్య ప్రస్తుత మరణాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన మృతుల సంఖ్య అని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 182.87 కోట్ల టీకాల పంపిణీ జరిగింది.
COVID19 | India logs 1,660 new cases & 4100 deaths (deaths include backlog from some states) in the last 24 hours.
Active caseload stands at 16,741
Total vaccination: 1,82,87,68,476(Representative image) pic.twitter.com/TmnEmR5NHb
— ANI (@ANI) March 26, 2022