లక్నో, మే 30: వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం(విశ్వగురు)గా మారిందని, దేవుళ్ల వల్లే మనదేశానికి గుర్తింపు వచ్చిందని సోమవారం అన్నారు.
‘రాముడు పుట్టిన స్థలం ఆయోధ్య, కృష్ణుడు పుట్టిన స్థలం మథుర, కాశీని శివుడు సృష్టించాడు. వీరి కారణంగానే భారత్కు గుర్తింపు వచ్చింది. వారి వల్లే విశ్వగురుగా మారింది’ అని వ్యాఖ్యానించారు. 800-850 ఏండ్లుగా నాశనం అయిన భారతీయ సంస్కృతిని కాపాడుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని అన్నారు.